PMMVY: గర్భిణీలకు రూ.6 వేలు అందించే పథకం.. ఈ స్కీమ్‌కు ఇలా అప్లై చేసుకోండి!

గర్భిణీల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌ పేరు 'ప్రధానమంత్రి మాతృ వందన యోజన'. చాలామందికి ఈ పథకంపై అవగాహన లేదు. 19ఏళ్లు దాటిన పేద గర్భిణీలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద గర్భిణీలకు రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తారు.

PMMVY: గర్భిణీలకు రూ.6 వేలు అందించే పథకం.. ఈ స్కీమ్‌కు ఇలా అప్లై చేసుకోండి!
New Update

దేశంలో ప్రజలకు చేయుతనిచ్చే ఎన్నో రకాల ప్రయోజనకరమైన సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వం అందించే స్కీమ్‌లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు కూడా ఉన్నాయి. సమాజంలోని దాదాపు ప్రతి వర్గానికి ఈ పథకాల ప్రయోజనాలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తుంటాయి. కొన్ని పథకాలలో వస్తువులు ఇస్తుంటారు. కొన్ని స్కీమ్స్‌లో ల్యాండ్స్‌ లేదా ఇల్లు లాంటివి ఇస్తుంటారు. మరికొన్ని స్కీముల్లో నేరుగా ఆర్థిక సాయం అందిస్తారు. ఈ లిస్ట్‌లోనే ప్రధాన మంత్రి మాతృ వందన యోజన ఉంది. మహిళలకు సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో గర్భిణీలకు రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తారు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

పథకం గురించి కీలక వివరాలు:

  • పథకం పేరు - ప్రధాన మంత్రి మాతృ వందన యోజన
  • ఇది ఎవరి పథకం ?- భారత ప్రభుత్వం
  • ప్రయోజనం ఎంత ? - రూ.6 వేలు ఆర్థిక సహాయం
  • ఎవరు అర్హులు ?- గర్భిణీలు
  • ఎందుకీ పథకం ? - పోషకాహార లోపంతో పిల్లలు పుట్టే సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఇలా చేయండి:

  • మీరు కూడా గర్భవతి లేదా గర్భవతి కాబోతున్నట్లయితే .. ఈ స్కీమ్‌లో చేరవచ్చు..
  • ముందుగా మీరు ఈ పథకానికి చెందిన అధికారిక వెబ్‌సైట్ wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana ని విజిట్ చేయాలి.
  • ఇది కాకుండా, మీరు మీ సమీపంలోని అంగన్‌వాడీకి కూడా వెళ్లవచ్చు.

అర్హులైన మహిళలు ఎవరు?

ప్రధాన మంత్రి మాతృ వందన యోజనలో చేరాలనుకుంటే ముందుగా మీరు అర్హులో కాదో తెలుసుకోవాలి. 19ఏళ్లు దాటిన గర్భిణీలు, పేద తరగతి వారు ఈ పథకానికి అర్హులు.

Also Read: అమెరికా చరిత్రంతా హత్యలు, హత్యాయత్నాలే.. లింకన్‌ నుంచి ట్రంప్‌ వరకు.. !

#pmmvy #pregnant-women
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe