Prabhas: శివుడి పాత్రలో నటించనున్న ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇప్పటికే సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్, రాజాడీలక్స్ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా నటించిన ప్రభాస్.. తాజాగా శివుడిగా నటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

New Update
Prabhas: శివుడి పాత్రలో నటించనున్న ప్రభాస్..!

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇప్పటికే సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్, రాజాడీలక్స్ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా నటించిన ప్రభాస్.. తాజాగా శివుడిగా నటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మంచు హీరో విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

అయితే ఈ సినిమాలో కీలకంగా భావించే శివుడి పాత్ర కోసం ప్రభాస్‌ను సంప్రదించగా అంగీకారం తెలిపినట్లు ప్రముఖ విమర్శకుడు రమేష్ బాలా ట్వీట్ చేశాడు. కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కి 'హరహర మహాదేవ్' మంచు విష్ణు రీట్వీట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. దీంతో ఈ వార్త ప్రభాస్ ఫ్యాన్స్‌, అటు మంచు ఫ్యామిలీ అభిమానులలో ఆసక్తిని రేపింది.

ఇక ఈ సినిమాలో మంచు విష్ణు సరసన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెల్లి.. నుపూర్ సనన్ నటించనుంది. ముఖేష్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాకు ప్రముఖ మాటల రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ రచన, రచనా సహకారం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతాన్ని అందిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై భారీ బడ్జెట్‌లో ఈ మూవీ తెరకెక్కనుంది. మరి కన్నప్ప మూవీలో ప్రభాస్ శివుడిగా నటించనున్నారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

మరోవైపు సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన సలార్ మూవీ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, ఆదిపురుష్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి. అందుకే ఫ్యాన్స్ అంతా సలార్ మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు. కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకుడు కావడం, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి. అంతేకాకుండా ఈ సినిమా రెండు భాగాలుగా రానుండడంతో అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: మహేష్‌ బాబు ఇంటికి కొత్త అతిథి!

Advertisment
తాజా కథనాలు