ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్.. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా బెనిఫిట్ షోల కోసం తెల్లవారుజామునే థియేటర్లకు వచ్చిన అభిమానులు.. రాముడికి పాలాభిషేకాలు చేశారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్లోని ఐమాక్స్ వద్ద ప్రభాస్ అభిమానులు బీభత్సం సృష్టించారు. ఓ అభిమాని మూవీ బాలేదని చెప్పినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ అతడ్ని చితక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జెన్యూన్ ఓపీనియన్ చెబితే కొట్టడం ఏంటని కొందరు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. మరి కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
పూర్తిగా చదవండి..‘ఆదిపురుష్’మూవీ రివ్యూ, సినిమా బాలేదని అన్నందుకు చితక్కొట్టిన ఫ్యాన్స్….
Translate this News: