Power Commission: కేసీఆర్‌కు మరోసారి నోటీసులు..ఆ తేదీలోపు వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు!

విద్యుత్ కొనుగోళ్ల అంశంపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్ కమీషన్ మరోసారి నోటీసులు పంపించింది. ఇప్పటి వరకు కమిషన్ కు వచ్చిన సమాచారంపై జూన్ 27వ తేదీలోపు తమ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది.

New Update
Telangana Politics: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు!

KCR: విద్యుత్ కొనుగోళ్ల అంశంపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్ కమీషన్ మరోసారి నోటీసులు పంపించింది. ఇప్పటి వరకు కమిషన్ కు వచ్చిన సమాచారంపై ఈ నెల 27వ తేదీలోపు తమ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ నర్సింహారెడ్డి ఆదేశాల మేరకు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణంపై వివరాలు తెలియజేయాలని కమిషన్ కేసీఆర్ ను కోరింది. ఛత్తీస్‌గడ్‌ నుంచి కొన్న విద్యుత్‌ గురించి కూడా సమాచారం కావాలంటూ జూన్ 19నే లేఖ పంపించగా.. దానిపై జూన్ 27లోపు సమాధానం ఇవ్వాలంటూ మరోసారి మంగళవారం లేఖ పంపించింది.

Advertisment
తాజా కథనాలు