/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/army-tankers-jpg.webp)
Terrorist Attack : జమ్మూ కాశ్మీర్(Jammu & Kashmir) లోని పూంచ్ జిల్లా ఖనేతర్లో ఈ సాయంత్రం ఆర్మీ(Army) వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు(Terrorist Attack) జరిపారు. ముష్కరుల దాడిని జవాన్లు తిప్పికొట్టారు ఈ ఘటన తర్వాత సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ప్రస్తుతం దీని పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇంకా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్లో కూడా ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై దాడి చేశారని, అందులో నలుగురు సైనికులు అమరులయ్యారని, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. . ఆర్మీ వాహనంపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు అడవుల్లో దాక్కున్నారు. ఆ ఘటన మరువకముందే మరో ఘాతుకానికి ఒడిగట్టారు. మూడు వారాల వ్యవధిలోనే ఇది రెండో ఘటన.
At around 1800h today, a Security Forces convoy of vehicles was fired upon by suspected terrorists from a jungle near Krishna Ghati #Poonch sector. No casualties to own troops. Joint search
Operations by #IndianArmy and #JKP are in progress.@adgpi @NorthernComd_IA pic.twitter.com/jR0ytWRy88— White Knight Corps (@Whiteknight_IA) January 12, 2024
ఈ సంఘటన తర్వాత, సైన్యం మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టింది. మండి నుండి పూంచ్ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసింది. ఉగ్రవాదుల కోసం వెతకడానికి భారీ ఆపరేషన్ ప్రారంభించింది. సరిహద్దు జిల్లాలైన రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ఉగ్రవాదులు ఇలాంటి చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ సంఘటనకు ముందు, నవంబర్లో రాజౌరీలోని బాజిమల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు మరియు ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు.