బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ జోకర్ లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్కు మైండ్ ఖరాబయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కేసీఆర్ డిసైడ్ చేస్తానడం హస్యాస్పదమన్నారు.
కాంగ్రెస్ గెలుపుతో ఈరకమైన మాటలు
కర్ణాటకలో బీజేపీ ఓటమి జీర్ణించుకోలేక బండి సంజయ్ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గంగులతో బండి సంజయ్ ములాఖత్ అయినట్లు లోకం కోడై కూస్తోందన్నారు. లిక్కర్ స్కాంలో కవితను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదో బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నలు వేశారు. అంతేకాకుండా బండి సంజయ్ పాదయాత్రకు ఫైనాన్స్ చేసింది సీఎం కేసీఆరేనని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
అభివృద్ధి పేరిట కోట్ల రూపాయల అవినీతి
అవసరం లేకున్నా బండి సంజయ్ను అరెస్ట్ చేసి..ఆయనకు హైప్ ఇచ్చింది కేసీఆరేన్నారు. కరీంనగర్లో అభివృద్ధి పేరిట, ఐలాండ్ పేరిట కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని పొన్నం ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ను బలహీనపరిచే కుట్ర చేస్తున్నాయని అన్నారు. బండి సంజయ్ చేసే ఖర్చంతా మంత్రి గంగుల కమలాకర్ ద్వారా కేసీఆర్ భరిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.