TS News: పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. సీఎం అవుతారన్న వార్తలపై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.!

పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు..తాను సీఎం అవుతారన్న వార్తలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేనే సీఎం అనడం ఊహాజనితం అన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్బంగా పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
TS News: పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. సీఎం అవుతారన్న వార్తలపై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.!

TS News:  పార్లమెంట్ ఎన్నికల తర్వాత తానే సీఎం అంటూ వస్తున్న వార్తలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పళ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మంత్రి పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు. నా దగ్గర పండ్లు ఉన్నాయి. అందుకే నాకు రాళ్ల దెబ్బలు తగులుతున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట రోజు ఉంటే నేను నెంబర్ 2 ఎలా అవుతానంటూ ప్రశ్నించారు. హైకమాండ్ కూడా నేను సీఎం కావాలంటే కొన్ని ఈక్వేషన్స్ చూస్తుంది కదా అని అన్నారు. నాకు సీఎం కావాలన్న ఆశలేదని..అలాంటి ఆలోచనే లేదని చెప్పారు. కాగా కొంతమంది నేతలు బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రశ్నకు..బీజేపీతో ఎవరూ టచ్ లోకి వెళ్లలేదని..అదంతా ప్రచారమే అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు వెసే ప్రయత్నం చేస్తున్నారు: 

తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయదని..ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవబోతుందని మంత్రి పొంగులేటి జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మీద మేము కక్షపూరితంగా కేసులు పెడుతున్నామని ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ గత ప్రభుత్వంలో వారు అధికార దుర్వినియోగంతో చేసిన తప్పులు అన్ని ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నాయ్ అన్నారు. జలాశయంలో నీరు లేకపోవడం జలాశయాల్లో నీరు లేకపోవడం, పంటలు ఎండిపోవడం వంటి ఫొటోలు.. వీడియోలు పెట్టి కొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు వెసే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.

కాళేశ్వరం ఫలితం ఎవరికి దక్కిందో అందరికి తెలిసిందే:

మా ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ లో..రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని నీటి నిల్వలు ఉంచాల్సిన బాధ్యత వారిపై ఉంది కాని చేయాల్సిన పనులు చేయకుండా భాద్యత విస్మరించి మాపై రాళ్ళేయడం తగదు అన్నారు. కాళేశ్వరం ఫలితం ఎవరికి దక్కిందో అందరికి తెలిసిందే..ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒకటి రెండు ఎంపీ సీట్లు గెలిస్తే గొప్ప అనుకోవాలన్నారు మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ..మాకు ఎంఐఎం మద్దతు తెలపుతుంది‌‌.ఇతర పార్టీల నుండి మా పార్టీలోకి రమ్మని మేం ఎవరిని అడగటం లేదు. వారికై వారు స్వచ్చందంగా వస్తున్నారన్నారు. మేం గేట్లు ఎత్తలేదు. ఎత్తితే వరద ఆగదన్నారు. మేం చెప్పిందే చేస్తున్నామని చెప్పారు.

గాడి తప్పిన వ్యవస్థను దారిలో పెడుతున్నం:

గత పాలకుల అవినీతి మీద పోరాడుతూనే..డిస్టర్బ్ అయిన వ్యవస్థను దారిలో పెడుతున్నమంటూ చెప్పుకొచ్చారు మంత్రి. 5ఎకరాలకు రైతు బంధు అని చెప్పినట్టే ఇస్తున్నాం. జీతాల చెళ్ళింపుల్లో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమే. ఆ దిశగా పరిష్కారం కోసం పనిచేస్తున్నాం.రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు వెనుకాడబోము. 14స్థానాలు గ్యారెంటీ గెలుస్తాం. గత ప్రభుత్వ అవినీతి సొమ్ము అంతా కక్కిస్తాం.ధరణి లో జరిగిన అవినీతి ని బయటకు తీస్తాం.ప్రధానిని కలిస్తే పొల్యూట్ అయినట్టు కాదు. రెండు సంవత్సరాలు కంటే ఎక్కువగా ఉన్న అధికారులను మొత్తం షిఫ్ట్ చేస్తాం.రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తాం.ధరణి లో మంచిని ఉంచుతాం.. భూమాత పోర్టల్ ను తీసుకొస్తామంటూ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆ రాష్ట్ర గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్..కోర్టునే ధిక్కరిస్తున్నారంటూ.!

Advertisment
తాజా కథనాలు