Ponguleti: నమ్ముకున్న వారందరికీ న్యాయం చేస్తా.. కాంగ్రెస్ ను గెలిపిస్తా: పొంగులేటి సంచలన ఇంటర్వ్యూ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రానుందని కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. టికెట్లు దక్కని. అవకాశం రాని నేతలకు అందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. By Nikhil 08 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టనున్నారని ఆ పార్టీ కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. గెలుపు అడ్డుకోవడానికి బీఆర్ఎస్, బీజేపీ ఒకటి అయ్యి తమపై దాడులు చేయించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పొంగులేటి ఆర్టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరికొన్ని రోజుల్లో తనతో పాటు తన సంస్థలు, కుటుంబ సభ్యులపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. తనకు ఎలాంటి వర్గాలు లేవని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: Telangana Elections: కొడంగల్లో హైటెన్షన్.. ఎమ్మెల్యే డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులందరి గెలపు కోసం తనతో పాటు తన వర్గీయులు ప్రయత్నిస్తారన్నారు. తనను నమ్ముకున్న వారందరికీ రానున్న ఇందిరమ్మ రాజ్యంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సూర్యాపేటలో టికెట్ విషయంలో తన ప్రమేయం లేదన్నారు. గెలుపే ప్రామాణికంగా హైకమాండ్ టికెట్లను కేటాయిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ అనే దోపిడీదారుడిని ముఖ్యమంత్రిగా చేయడానికి ఇష్టపడరన్నారు. కేసీఆర్ ను ఫామ్ హౌజ్ ను పరిమితం చేస్తారన్నారు. పొంగులేటి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి. #telangana-elections-2023 #ponguleti-srinivasa-reddy #telangana-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి