మాదాపూర్‎లో నోట్ల కట్టలు.. రూ. 5 కోట్లు ఎవరివి!

హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీగా నగదు పట్టుబడింది. మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు తనిఖీల్లో రెండు సంచుల్లో తరలిస్తున్న రూ. 5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సొమ్మును ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు.

New Update
మాదాపూర్‎లో నోట్ల కట్టలు.. రూ. 5 కోట్లు ఎవరివి!

Election code: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా హైదరాబాద్ నగరంలో భారీగా నోట్ల కట్టలు బయటపడడం సంచలనంగా మారింది. గచ్చిబౌలి సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు రెండు సంచుల్లో తరలిస్తున్న రూ. 5 కోట్ల నోట్ల కట్టలను గుర్తించి సీజ్ చేశారు. ఎన్నికల నియమావళి (Election Code) అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: తుఫాన్‌ ఎఫెక్ట్‌.. వర్షాలే వర్షాలు..!

గచ్చిబౌలి ఘటనలో వారి దగ్గరి నుంచి రూ 5 కోట్ల నగదు, మూడు సెల్ ఫోన్లు, కారును మాదాపూర్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు ఎవరికి చెందినదన్న విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అది ఓ వ్యాపార వేత్తకు చెందినదిగా గుర్తించినట్లు సమాచారం. నగదును ఐటీ శాఖ అధికారులకు పోలీసులు అప్పగించారు.

Advertisment
తాజా కథనాలు