/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Bijapur-Encounter-Case.jpg)
Bijapur Encounter Case: బీజాపూర్ లోని మద్దెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బద్దెపర అడవుల్లో ఈ ఉదయం జరిగిన ఎన్కౌంటర్ కేసుపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఎన్కౌంటర్లో ఓ మహిళ సహా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు చెప్పారు. ఘటనా స్థలం నుంచి మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఎన్కౌంటర్లో రూ.8 లక్షల రివార్డు పొందిన మహిళా మావోయిస్టు నాయకురాలు మనీలా హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. మనీలా మావోయిస్టు సంస్థలో డీవీసీఎం పదవిలో ఉన్నారు.
Chhattisgarh | Encounter underway between Security Forces and naxals in the forest area under Madded PS limits, says SP Bijapur Jitendra Yadav
Details awaited.
— ANI (@ANI) May 29, 2024