నాగర్ కర్నూల్ లో ఈ రోజు నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. నిన్న జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సభలో జన సముద్రాన్ని చూశానన్నారు. మళ్లీ అలాంటి జన సముద్రాన్ని నాగర్ కర్నూల్ లో చూస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే దేశ ప్రజలు ఫలితాలను చెబుతున్నారన్నారు. మరో సారి ప్రజలు మోదీ ఫ్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దేశ వ్యాప్తంగా 400కు పైగా పార్లమెంట్ సీట్లను సాధించబోతోందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మోస పూరిత రాజకీయాలను ప్రజలను నమ్మడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ విజయాన్ని కోరుకుంటున్నారన్నారు. తెలంగాణను దేశానికి దక్షిణ ముఖ ద్వారంగా చెబుతారన్నారు. అలాంటి తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నలిగిపోయిందన్నారు. కాంగ్రెస్ కు దేశాన్ని నాశనం చేయడానికి ఐదేళ్లు చాలన్నారు.
Elections 2024: కాంగ్రెస్ గెలిస్తే దేశం నాశనం.. తెలంగాణలో దళితులకు అవమానం: మోదీ
కాంగ్రెస్ కు దేశాన్ని నాశనం చేయడానికి ఐదేళ్లు చాలని ధ్వజమెత్తారు ప్రధాని మోదీ. రానున్న ఎన్నికల్లో బీజేపీకి దేశ వ్యాప్తంగా 400కు పైగా ఎంపీ సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ లో ఈ రోజు నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు.
Translate this News: