PM Modi Nomination: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్.. హైలైట్స్ ఇవే!

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి మూడోసారి నామినేషన్‌ వేశారు. ఆయన నామినేషన్ వేసే సమయంలో ఆయనతో పాటు యూపీ సీఎం యోగి, రామమందిర ముహూర్తం నిర్ణయించిన గణేశ్వర్ శాస్త్రి ఉన్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

PM Modi Nomination: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్.. హైలైట్స్ ఇవే!
New Update

PM Modi Nomination: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి మూడోసారి నామినేషన్‌ దాఖలు చేశారు. రామమందిరం శుభ సమయాన్ని నిర్ణయించిన గణేశ్వర్ శాస్త్రితో సహా నలుగురు ప్రతిపాదకులు కూడా ఆయనతో ఉన్నారు. ప్రధాని 2 సెట్లలో నామినేషన్ దాఖలు చేశారు. ఎలక్షన్ ఆఫీసర్  తనను కుర్చీపై కూర్చోమని కోరినప్పటికీ నామినేషన్ సమర్పించేవరకూ  ప్రధాని నామినేషన్ గదిలోనే నిలబడి ఉన్నారు. నామినేషన్ సమర్పించిన తర్వాత ఆయన కూర్చున్నారు. నామినేషన్ సమయంలో సీఎం యోగి కూడా ఉన్నారు. గణేశ్వర్ శాస్త్రితో పాటు, బైజ్‌నాథ్ పటేల్, లాల్‌చంద్ కుష్వాహా, సంజయ్ సోంకర్ ఉన్నారు. ముగ్గురూ బీజేపీ స్థానిక నేతలే. కుల సమీకరణాన్ని పరిష్కరించడానికి ప్రతిపాదకుల మధ్య ప్రయత్నం జరిగింది. ప్రాతిపాదికుల్లో ఒక బ్రాహ్మణుడు, 2 OBC, ఒక దళిత ముఖం ఉండేలా చర్యలు తీసుకున్నారు. 

PM Modi Nomination: ఉదయం 9.30 గంటలకు దశాశ్వమేధ ఘాట్‌కు చేరుకున్న ప్రధాని, అక్కడ 20 నిమిషాల పాటు గంగారాధన చేశారు. అనంతరం హారతి నిర్వహించి క్రూయిజ్‌లో నమో ఘాట్‌కు చేరుకున్నారు. కాశీలోని కొత్వాల్ అనే కాలభైరవ దేవాలయాన్ని ప్రధాని సందర్శించి పూజలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన కలెక్టరేట్ నుంచి రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. ఇక్కడ కార్యకర్తల సదస్సులో ఆయన ప్రసంగిస్తారు.

Also Read: వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ ఈరోజు

PM Modi Nomination: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు కార్యక్రమానికి వచ్చారు.  బీహార్ సీఎం నితీశ్ కుమార్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, పుదుచ్చేరి సీఎం ఎన్. రంగస్వామి, నాగాలాండ్ సీఎం నెఫి రియో, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేంద్ర మంత్రి రాందాస్ అథ్వాలే, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు, బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, ఎల్జేపీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, ఎల్జేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంగద్ పాశ్వాన్ ఉన్నారు

PM Modi Nomination: వీరితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్,  జేడీయూ నేత ఉపేంద్ర కుష్వాహ, ఏజేఎస్‌యూ చీఫ్ సుదేశ్ మహతో, నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్, రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి, అప్నాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్ పాల్, ఎంపీ అన్బుమణి రాందాస్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్, బీజేపీ నేత దేవనాథన్ యాదవ్, డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) కేరళ కన్వీనర్ తుషార్ వెల్లపల్లి, అస్సాం వ్యవసాయ మంత్రి అతుల్ బోరా, అస్సాం ఆరోగ్య మంత్రి కేశబ్ మొహంతా, వీరేంద్ర ప్రసాద్ వైష్, బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ సిఇఒ ప్రమోద్ బోరో, అనిరుద్ధ కార్తికేయన్, ర్వాంగ్వారా తదితరులు కలెక్టరేట్ హాల్‌లో ఉన్నారు. 

#varanasi #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe