మేమెప్పుడూ మీతోనే ఉంటాం: ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, రాహుల్‌ గాంధీ ట్వీట్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తదితరులు భారత జట్టుకు బాసటగా నిలిచారు. ఓటమితో కుంగిపోవద్దని, తామెప్పుడూ జట్టుకు మద్దతుగా ఉంటామని ట్వీట్‌ చేశారు.

మేమెప్పుడూ మీతోనే ఉంటాం: ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, రాహుల్‌ గాంధీ ట్వీట్లు
New Update

IND vs AUS: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తదితరులు భారత జట్టుకు బాసటగా నిలిచారు. ఓటమితో కుంగిపోవద్దని, తామెప్పుడూ జట్టుకు మద్దతుగా ఉంటామని ట్వీట్‌ చేశారు. “ప్రియమైన టీమ్ ఇండియా! ప్రపంచకప్ లో మీరు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు, మీ సంకల్పం చాలా గొప్పది. మీరు గొప్ప స్ఫూర్తితో ఆడి, దేశానికి గర్వకారణమయ్యారు. మేము ఇప్పుడూ, ఎప్పుడూ మీతోనే ఉంటాం” అని ప్రధాని మోదీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా భారతజట్టుకు మద్దతుగా ట్వీట్లు చేశారు. మరోవైపు అభిమానుల నుంచి కూడా భారత జట్టుకు మద్దతు లభిస్తోంది. ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు.

#icc-odi-world-cup-2023 #amith-shah #pm-narendra-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe