Vishaka:8వ తరగతి బాలికపై అత్యాచారం..గర్భవతిని చేసిన పీఈటీ!

విశాఖలోని నారాయణ స్కూల్‌లో పీఈటీ దారుణానికి పాల్పడ్డాడు. 8వ తరగతి చదువుతున్న 13ఏళ్ల బాలికపై దుర్గా ప్రసాద్ లైంగిక దాడి చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

New Update
Vishaka:8వ తరగతి బాలికపై అత్యాచారం..గర్భవతిని చేసిన పీఈటీ!

Rape case: విశాఖలోని నారాయణ స్కూల్‌లో దారుణం జరిగింది. రక్షణగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బెదిరింపులకు పాల్పడుతూ పలుసార్లు లైంగికదాడి చేయడంతో 13 ఏళ్లకే ఆమె గర్భం దాల్చింది. ఈ దారుణమైన ఘటన తెలుగు రాష్ట్రాలను కలిచివేయగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అసలు విషయం ఇలా బయటపడింది..
విశాఖపట్నం జిల్లాలోని నారాయణ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న 13ఏళ్ల బాలికపై పీఈటీ బెరా దుర్గా ప్రసాద్ లైంగిక దాడికి పాల్పడ్డట్లు పోలీసులు విచారణలో తెలిపారు. కొంతకాలంగా బాలికను భయబ్రాంతులకు గురిచేసి లొంగదీసుకుని లైంగిక దాడి చేసినట్లు చెప్పారు. అనారోగ్యంతో కనిపిస్తున్న కూతురును తల్లిదండ్రులు వైద్యుల దగ్గరకు తీసుకెళ్లగా అసలు విషయం బయటపడిందని, ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, పూర్తి విచారణ తర్వాత చట్టరిత్యా కఠినంగా శిక్షిమని తెలిపారు.

ఇది కూడా చదవండి: Aha : ‘మిక్సప్ ఆన్’..సెమీ పోర్న్ మూవీ పరిచయం చేయబోతున్న అల్లు ఫ్యామిలీ!

ఇక ఈ దుర్మార్గంపై బాలిక బంధువులు, అందులో చదివే పిల్లల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పిల్ల పట్ల నిర్ల్యక్షంగా వ్యవహరిస్తున్న పాఠశాల యజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు