YCP MLA: వైసీపీకి బిగ్ షాక్..జనసేన లోకి ఎమ్మెల్యే ?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలేలా ఉంది. ఎమ్మెల్యే పెండం దొరబాబుకు పిఠాపురం టిక్కెట్ ను వైసీపీ అధిష్టానం నిరాకరించడంతో జనసేనలోకి వెళ్లాలనే ప్లాన్ లో దొరబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
YCP MLA: వైసీపీకి బిగ్ షాక్..జనసేన లోకి ఎమ్మెల్యే ?

Also Read: తెలంగాణలో మళ్లీ కరోనా కల్లోలం.. హైదరాబాద్ లో 14 నెలల చిన్నారికి ఆక్సిజన్.

వివాహం ఉందని నిన్నా హుటా హుటిన ప్లైట్ లో ఎమ్మెల్యే పెండెం దొరబాబు హైదరాబాద్ వెళ్ళినట్లు తెలుస్తోంది. జనసేన లో చేరిక విషయమై హైదరాబాద్ లో సమావేశం అయినట్లు నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. పెండెం దొరబాబు అల్లుడు రక్ష రామయ్య ద్వారా మంతనాలు సురు చేస్తూన్నరనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఐదురోజుల క్రితం సీటు లేదని తెలిసాక వందల మంది అనుచర వర్గంతో తాడేపల్లి క్యాంపుకు వెళ్లి తన సత్తా చూపించుకున్నారు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు. సీటు తనకే కావాలని మరోసారి అవకాశం ఇవ్వాలని మిథున్ రెడ్డి వద్ద పెండెం దొరబాబు సహచర అనుచర వర్గం గట్టిగా పట్టు పట్టినట్లు తెలుస్తోంది.

కాకినాడ ఎంపీ సీటుకు వైసీపీ నుండి పెండెం దొరబాబు కు ఆహ్వానం అందినా దానిని ఆయన తిరస్కరించారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి పిఠాపురం సీటుపై అధిష్టానం డైనమాలో పడి గత రెండు రోజులుగా నియోజవర్గంలో వైసిపి సర్వే నిర్వహిస్తోంది. కాగా, ఎమ్మెల్యే పార్టీ మార్పుపై పొలిటకల్ హీట్ నెలకొంది.. గంట గంటకు రాజకీయ పరిణామాలు మారుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు