Paytm Founder Steps Down: పేటీఎం(Paytm) ఛైర్మన్ విజయ్ శేఖర్ శర్మ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్ పేటిఎంకి సంబంధించిన బోర్డులో సభ్యుడిగా ఉంటారు. దీంతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ దేవేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, రిటైర్డ్ ఐఏఎస్ రజనీ సేఖ్రీ సిబల్ బోర్డు సభ్యులుగా ఉంటారు. బోర్డులో ఛైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. విజయ్ శేఖర్ శర్మ రాజీనామా తర్వాత PPBL ఇప్పుడు కొత్త ఛైర్మన్ను నియమించే ప్రక్రియను ప్రారంభించింది.
పూర్తిగా చదవండి..Paytm: పేటీఎం వ్యవస్థాపకుడు షాకింగ్ నిర్ణయం!
పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, బోర్డు సభ్యుడి పదవి నుంచి శర్మ తప్పుకున్నారు. విజయ్ శేఖర్ శర్మ ఈ బ్యాంక్లో అతిపెద్ద వాటాదారు. ఫిన్టెక్ సంస్థ పేటిఎంపై RBI చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
Translate this News: