Rakshana : ఓటీటీలోకి 'RX100' బ్యూటీ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ మూవీ 'రక్షణ' ఓటీటీకి రెడీ అయ్యింది. ఆగస్టు 1 నుంచి 'ఆహా'లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు 'ఆహా' సంస్ధ ట్వీట్ చేస్తూ..'లేడీ సింగ్‌ గర్జించేందుకు వస్తోంది' అంటూ మూవీ పోస్టర్‌ను పంచుకుంది.

Rakshana : ఓటీటీలోకి 'RX100' బ్యూటీ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?
New Update

Payal Rajput's Rakshana Movie : టాలీవుడ్ హాట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ మూవీ 'రక్షణ' ఓటీటీకి రెడీ అయ్యింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జూన్‌ 7న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనలు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీని ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

రక్షణ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్న 'ఆహా' ఓటీటీ.. ఈ మూవీని ఆగస్టు 1, 2024 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని 'ఆహా' సంస్ధ ట్వీట్ చేస్తూ..'లేడీ సింగ్‌ గర్జించేందుకు వస్తోంది' అంటూ మూవీ పోస్టర్‌ను పంచుకుంది. పోలీస్ ఆఫీసర్‌గా పాయల్ రాజ్‌పుత్ కనిపించిన ఈ మూవీలో ఆమె యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగానే అలరించాయి.

పాయల్ ఫస్ట్ టైమ్ చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కావడంతో ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ మూవీని ప్రణవ్ ఠాకూర్ దర్శకత్వం వహించగా, మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు మానస్, రాజీవ్ కనకాల, శివన్నారాయణ, వినోద్ బాలా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

#payal-rajput #rakshana-movie-ott
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe