AP: పంచాయతీరాజ్ శాఖలో అవినీతిపై అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్..!

పంచాయతీ నిధులను పంచాయతీలకే వాడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసన మండలిలో అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ శాఖలో జరిగిన అవినీతిపై కమిషన్ వేసే ఆలోచనలో ఉన్నామన్నారు. ఎంత మేరా అవినీతి జరిగిందో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

New Update
Pawan Kalyan: గ్రామపంచాయతీ నిధులపై శ్వేతపత్రం: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పంచాయతీ నిధులను పంచాయతీలకే వాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాసన మండలిలో అన్నారు. కేంద్రం నుంచి నిధులు పంచాయతీలకు వస్తాయన్నారు. రూ. 9098 కోట్ల నిధులు మార్చికి విడుదల కావాల్సి ఉండగా ఇంకా నిధులు విడుదల కాలేదని.. నిధులు విడుదలకు సంబంధించి అధికారులతో కూర్చుని చర్చిస్తామని అన్నారు.

రూ. 7518 కోట్లు ఇప్పటిదాకా పంచాయతీ రాజ్ ఇనిస్టిట్యూషన్స్ కి విడుదల చేశారని.. 8 సార్లు ఇప్పటివరకు నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన నిధులు పంచాయతీలకి ఎప్పుడూ ఆలస్యంగానే వెళ్లాయన్నారు. కేంద్రం నుంచి సమయానికి నిధులు రాష్ట్రానికి వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం ఐదుసార్లు పంచాయతీకి నిధులు ఇవ్వడంలో ఆలస్యం చేసిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ. 1100 కోట్లు పెనాల్టీ కేంద్రానికి కట్టిందన్నారు. పంచాయతీ సర్పంచుల అనుమతి లేకుండా రూ. 2165 కోట్ల నిధులు డిస్కంలకు గత ప్రభుత్వం కట్టిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ శాఖలో జరిగిన అవినీతిపై కమిషన్ వేసే ఆలోచనలో ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖలో ఎంత మేరా అవినీతి జరిగిందో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా రాష్ట్ర పంచాయతీలకు వచ్చి విచారణ చేశారన్నారు.

Also Read:  తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గడ్ మధ్య రాకపోకలు బంద్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు