జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను కొనసాగిస్తున్నారు. మొదటి దశ వారాహి యాత్ర సూపర్ సక్సెస్ కావడంతో, రెండో దశ వారాహి విజయయాత్రకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 9వ తేదీన ఏలూరు నుంచి వారాహి రెండో దశ యాత్ర ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే రెండో దశ యాత్ర ప్రణాళికపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటు పార్టీ నేతలతో పవన్ చర్చించారు.
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు చేపట్టిన వారాహి విజయ యాత్ర తదుపరి షెడ్యూల్ ఖరారు
ఈ నెల 9వ తేదీన ఏలూరు నగరంలో బహిరంగ సభ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తారు.
ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యాత్ర నిర్వహణపై శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పార్టీ రాజకీయ… pic.twitter.com/TOzszyOuyi
— JanaSena Party (@JanaSenaParty) July 6, 2023
అయితే అన్నవరంలో గత నెల 14వ తేదీన మొదటి దశ ప్రారంభమైంది. దాదాపు 10 రోజుల పాటు విజయవంతంగా యాత్రను పూర్తి చేశారు. శనివారం మళ్లీ ఏలూరు సభతో రెండో దశ వారాహి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గ నేతలను పవన్ కళ్యాణ్ కలుస్తారు. స్థానిక రాజకీయ పరిస్థితులపై వారితో మాట్లాడతారు.
కాగా, తొలి దశ వారాహి యాత్రలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్.. అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం జగన్ నుంచి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ పార్టీ నేతలు ఎవర్నీ వదలకుండా విమర్శలు గుప్పించారు. ఇక, పవన్ కళ్యాణ్ కామెంట్లకు అంతేస్థాయిలో అధికార వైసీపీ నుంచి కౌంటర్లు పడ్డాయి. సీఎం జగన్ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్లపై కౌంటర్ ఎటాక్కు దిగారు.
[vuukle]