Parliament Sessions: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు

ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. జూన్ 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నుకోబడ్డ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 26న స్పీకర్ ఎంపిక జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Parliament Sessions: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు
New Update

Parliament Sessions: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. జూన్ 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నుకోబడ్డ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 26న స్పీకర్ ఎంపిక జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మూడోసారి ప్రధానిగా మోదీ ఈ నెల 9న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 71 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మోదీ మంత్రి వర్గంలో ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు దక్కాయన్నదానిపై ఆసక్తి నెలకొంది. ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీల వివరాలు పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) కు 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ 8 మంది మంత్రులతో రెండో స్థానంలో నిలించింది. 

ఇక మహారాష్ట్ర 6, మధ్యప్రదేశ్ 5, రాజస్థాన్ 5, గుజరాత్ 4, కర్ణాటక 4, ఆంధ్రప్రదేశ్‌ 3, తమిళనాడు 3, హర్యాణాకు 3 మంత్రి పదవులు దక్కాయి. అలాగే తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, ఒడిశా, ఝూర్ఖండ్ రాష్ట్రాలకు రెండేసి మంత్రి పదవులు (MP Seats) కేటాయించారు. ఢిల్లీ, గోవా, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, అరుణచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు ఒక్కో మంత్రి పదవి దక్కింది.

#parliament-sessions
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి