మణిపూర్ అంశంపై సోమవారం కూడా పార్లమెంటు దద్దరిల్లింది. ప్రధాని మోడీ సభలో ప్రకటన చేయాలన్న డిమాండ్తో ప్రతిపక్ష ఎంపీలు సభా కార్యకలాపాలను స్తంభింపజేశారు. దీంతో సభ దీనిపై చర్చిస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ హామీ ఇవ్వగా.. ముందు మోడీ సభకు వచ్చి ప్రకటన చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. వారి నినాదాలతో ఉభయ సభలూ హోరెత్తాయి. మణిపూర్ అంశంపై చర్చకు 68 మంది ఎంపీలు నోటీసులు ఇచ్చారని, కానీ ప్రభుత్వం దీనిపై సమగ్ర చర్చ జరపకుండా తప్పించుకుంటున్నదని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవలసిందిగా చైర్మన్ జగదీప్ ధన్ కర్ చేసిన సూచనను విపక్షాలు పట్టించుకోకుండా నినాదాలు కొనసాగించాయి.
పూర్తిగా చదవండి..పార్లమెంట్ ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా
మణిపూర్ అంశంపై సోమవారం కూడా పార్లమెంటులో విపక్షాలు పెద్దఎత్తున రభసకు దిగడంతో ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా పడ్డాయి. దీనిపై ప్రధాని మోడీ సభలో ప్రకటన చేయాలన్న డిమాండ్తో ప్రతిపక్ష ఎంపీలు సభా కార్యకలాపాలను స్తంభింపజేశారు.
Translate this News: