హైదరాబాద్‌లో దారుణం.. బిర్యానీలో పెరుగు అడిగినందుకు చంపేశారు

హైదరాబాద్ పంజాగుట్టలో దారుణం జరిగింది. బిర్యానీ లవర్స్ షాక్ అయ్యే ఘటన జరిగింది. నగరం నడిబొడ్డున పంజాగుట్ట సిగ్నల్స్‌ దగ్గర ఉన్న మెరిడియన్ హోటల్‌లో కస్టమర్‌ను సిబ్బంది కొట్టి చంపేశారు.

New Update
హైదరాబాద్‌లో దారుణం.. బిర్యానీలో పెరుగు అడిగినందుకు చంపేశారు

హైదరాబాద్ పంజాగుట్టలో దారుణం జరిగింది. బిర్యానీ లవర్స్ షాక్ అయ్యే ఘటన జరిగింది. నగరం నడిబొడ్డున పంజాగుట్ట సిగ్నల్స్‌ దగ్గర ఉన్న మెరిడియన్ హోటల్‌లో కస్టమర్‌ను సిబ్బంది కొట్టి చంపేశారు. అసలు ఏం జరిగిందంటే.. లియాకత్ అనే వ్యక్తి బిర్యానీ కోసం ఆదివారం రాత్రి మెరిడియన్ హోటల్‌కు వెళ్లాడు. బిర్యానీ తింటూ మరో కప్పు పెరుగు కావాలని సిబ్బందిని అడిగాడు. దీనిపై వెయిటర్స్, లియాకత్ మధ్య వాగ్వాదం జరిగింది. కస్టమర్‌ అని కూడా లేకుండా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో లియాకత్‌పై సిబ్బంది దాడి చేసి కొట్టారు. గట్టిగా దెబ్బలు కొట్టడంతో గొడవ పెద్దది అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

publive-image

కుటుంబసభ్యుల ఆందోళన..

స్టేషన్‌లో విచారిస్తుండగా ఒక్కసారిగా లియాకత్ కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ మద్దతు తెలిపారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఎక్స్‌ట్రా పెరుగు అడిగనందుకు దారుణంగా కొట్టి తమ కుమారుడిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తికి తీవ్ర గాయాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు