కరోనా వైరస్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తాజాగా కరోనాకు చెందిన కొత్త వేరియంట్ బ్రిటన్లో వేగంగా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ వైరస్లో జన్యుమార్పుల వల్ల ఏర్పడిన EG.5.1 అనే కొత్త వేరియంట్ బ్రిటన్ వాసులను వణికిస్తోంది. ఈ వేరియంట్ను అంకెల్లో పలకడం ఇబ్బందిగా ఉండటంతో ఎరిస్ అని పేరు పెట్టారు. యూకేలో నిర్ధారణ అవుతున్న ప్రతి ఏడు కరోనా కేసుల్లో ఒకటి ఎరిస్ అని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) రెండు వారాల క్రితమే ఎరిస్ వేరియంట్ను ట్రాక్ చేసింది. యూకేలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..మళ్లీ కరోనా కలవరం.. వేగంగా వ్యాపిస్తోన్న కొత్త వేరియంట్
కొద్దికాలంగా కరోనా వైరస్ కేసులు అంతగా రాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ తరుణంలో కరోనా కొత్త వేరియంట్ మళ్లీ ఆందోళన కల్గిస్తోంది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని WHO హెచ్చరించింది.
Translate this News: