NEET Debate in Parliament: కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన INDI బ్లాక్ లీడర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ తొలిసారి ఫ్లోర్ లీడర్ల సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్లో చర్చల సమయంలో నీట్ పరీక్ష అవకతకవకాలకు నిరసనగా తమ నేతలంతా నల్ల బ్యాండ్లు ధరించాలని నిర్ణయించారు. నీట్ అంశంపై ఓ రోజంతా కేటాయించాలని INDI కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
పూర్తిగా చదవండి..NEET Debate: మోదీ గారూ సమాధానం చెప్పండి.. నీట్పై చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్!
నీట్ పేపర్ లీక్ వ్యవహారం పార్లమెంట్ను కుదిపేయనుంది. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై చర్చించేందుకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నీట్ వివాదంపై కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని మోదీ ఏం సమాధానం చెబుతారన్నదానిపై ఆసక్తి నెలకొంది.
Translate this News: