మణిపూర్ పరిస్థితిపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాత్రంతా విపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ధర్నా చేశారు. ప్రతిపక్ష కూటమి..’ఇండియా’ లోని కాంగ్రెస్, ఆప్, టీఎంసీ తదితర పార్టీల సభ్యులు గాంధీజీ విగ్రహం వద్ద నిరసనకు కూర్చున్నారు. మూడు రోజులుగా పార్లమెంట్ సమావేశాలు అర్ధాంతరంగా వాయిదా పడుతున్నాయని, అతి ముఖ్యమైన మణిపూర్ అంశంపై చర్చ జరగనే లేదని, దీనిపై తాము వాయిదా తీర్మాన నోటీసులు కూడా అందజేశామని వారు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..రాత్రంతా విపక్ష ఎంపీల ధర్నా.. మణిపూర్ అంశమే ప్రధాన ‘అజెండా’
'ఇండియా ఫర్ మణిపూర్' అని రాసి ఉన్న ప్లకార్డులు చేతబట్టుకుని విపక్షాలు గంటలపాటు ధర్నా చేశాయి. రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ని మిగతా సభా కాలానికి గాను సభ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగా కూడా ఇది జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే తెలిపారు.
Translate this News: