గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా

ప్రధాని మోదీ అమెరికా పర్యటనతో ఎన్నారైల కష్టాలకు త్వరలో ముగింపు పలకబోతుంది. హెచ్-1బీ వీసా రెన్యూవల్ విధానాన్ని మరింత సరళీకరించే దిశగా అగ్రరాజ్యం ప్లాన్‌ చేస్తోంది. స్వదేశానికి వెళ్లకుండానే వీసా రెన్యూ చేసుకునేందుకు ఎన్నారైలకు అవకాశం ఇచ్చింది.ఈ దిశగా పైలట్ ప్రాజెక్టు తర్వలో అమెరికా ప్రారంభించనున్నది. దీనిపై విస్పష్ట ప్రకటన విడుదల కానున్నట్టు సంబంధిత వర్గాల వెల్లడించారు.

New Update
గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా

Opportunity for NRIs to renew their visa

కష్టాలు త్వరలో తీరనున్నాయి

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో అక్కడి ఎన్నారైలకు ఓశుభవార్త చెప్పారు. త్వరలో భారతీయుల వీసా కష్టాలు తీరుతున్నాయన్నారు. హెచ్-1బీ వీసా రెన్యూవల్‌ విధానాన్ని మరింతగా సరళీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ దిశగా త్వరలో ఓ పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించబోతోందని, ఇందులో భాగంగా స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎన్నారైలు తమ వీసాలను రెన్యూవల్ చేసుకునే అవకాశం దక్కనుందని సమాచారం.

హెచ్-1బీ వీసా రెన్యూవల్ విధానం

పైలట్ ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా కొద్ది మంది విదేశీయులకు ఈ అవకాశం కల్పించనున్నారు. ఈ విషయమై నేడే అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. హుచ్-1బీ వీసాదారుల్లో మెజారిటీ భారతీయులేనన్న విషయం తెలిసిందే. గతేడాది జారీ అయిన 4.42 లక్షల హెచ్-1బీ వీసాల్లో అత్యధికం భారతీయులే దక్కించుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు