విహార యాత్ర..విషాద యాత్రగా ముగిసింది!

ఆదివారం పూట స్నేహితులందరూ కలిసి సరదాగా గడుపుదామనుకున్నారు. కానీ ఆ సరదా వారి పాలిట శాపంగా మారింది. ఆరుగురు స్నేహితులు సముద్రంలో కొట్టుకుపోయిన దారుణ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

New Update
విహార యాత్ర..విషాద యాత్రగా ముగిసింది!

ఆదివారం పూట స్నేహితులందరూ కలిసి సరదాగా గడుపుదామనుకున్నారు. కానీ ఆ సరదా వారి పాలిట శాపంగా మారింది. ఆరుగురు స్నేహితులు సముద్రంలో కొట్టుకుపోయిన దారుణ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. మత్స్యకారులు వెంటనే అప్రమత్తమై ఐదుగురిని కాపాడారు.

గల్లంతైన ఒకరి మృతదేహం కొంతసేపటి తరువాత తీరానికి కొట్టుకుని వచ్చింది. మరొకరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్టణానికి చెందిన కట్టోజు సాయి (19), కట్టోజు కావ్య (17), సింహాచలానికి చెందిన గన్నవరపు సాయి ప్రియాంక (27), గన్నవరపు రవి శంకర్‌ (28), అల్లిపురానికి చెందిన కండిపల్లి ఫణీంద్ర (25), కండిపల్లి సాయికిరణ్‌ (25) ఈ ఆరుగురు నిన్న ఉదయం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సీతపాలెం బీచ్‌ కు సరదాగా గడిపేందుకు వచ్చారు.

అందరూ కలిసి ఆనందంగా గడిపిన తరువాత..తీరం సమీపంలోని రాళ్ల పై నిలబడి ఫోటోలు తీసుకుంటున్న సమయంలో పెద్ద కెరటం ఒక్కసారిగా వారి మీదకు వచ్చింది. దాంతో ఆరుగురు ఒక్కసారిగా సముద్రం లోపలికి వెళ్లిపోయారు. వెంటనే అక్కడ ఉన్న మత్య్స కారులు వారిని రక్షించేందుకు సముద్రంలో దూకారు.

అప్పటికే కట్టోజు సాయి కొట్టుకుపోగా మిగిలిని ఐదుగురిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. సాయి ప్రియాంక సముద్రపు నీటిని తాగేయడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. గల్లంతైన సాయి మృతదేహం అచ్యుతాపురం మండలంలోని పూడిమడక తీరానికి కొట్టుకొచ్చింది. కోమాలోకి వెళ్లిన సాయి ప్రియాంక ప్రస్తుతం విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

అచ్యుతాపురం తీరానికి కొట్టుకువచ్చిన సాయి మృతదేహాన్ని వాహనంలో తరలించే వీలు లేకపోవడంతో ఎస్సై సన్యాసి నాయుడు సమక్షంలో పోలీసులే సుమారు రెండు కిలో మీటర్లు వరకు మోశారు. అనంతరం అంబులెన్సులో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.

Advertisment
తాజా కథనాలు