తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల సెప్టెంబరు కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం విడుదల చేస్తున్నట్లు తెలిపింది. భక్తులందరూ https://tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు అని టీటీడీ తెలిపింది. అష్టదళ పాదపద్మారాధన, సుప్రభాతం, తోమాల, అర్చన, ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం ఈ నెల 19న ఉదయం 10 నుంచి 21వ తేదీ ఉదయం 10 వరకు నమోదు చేసుకోవచ్చు. ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 22న 10 గంటలకి విడుదల చేస్తామని ఆలయం అధికారులు తెలిపారు. అదేవిధంగా సెప్టెంబరు ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, మాసం కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటా, సంబంధించిన దర్శన టికెట్ల కోటాను ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకి విడుదల చేస్తారు. సెప్టెంబరు నెల అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఈనెల 23న 10 గంటలకు విడుదల చేస్తారు. ఆగస్టు 27 నుంచి 29 వరకు జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం పదింటికి తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.
[vuukle]