ఘనంగా పాతబస్తీ బోనాలు..కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. బోనాల జాతరతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకోడానికి ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. ఆలయం దగ్గర బోనాలతో మహిళలు బారులు తీరారు. లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు పెట్టారు. కాగా ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

New Update
ఘనంగా పాతబస్తీ బోనాలు..కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

బోనాల సందడి

శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, డప్పుల వాద్యాలు, నృత్యాలు, ఘటాల ఊరేగింపుతో ఆదివారం హైదరాబాద్‌ పాతబస్తీ బోనాల సందడి ప్రారంభమైంది. ప్రాచీన దేవాలయ ఉత్సవాల నిర్వహణకు నిధులు మంజూరు చేసి పండుగ వాతావరణాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది . ప్రధాన ప్రాచీన ఆలయాలైన హరిబౌలి అక్కన్న మాదన్న ఆలయం, లాల్‌ దర్వాజా, ఉప్పుగూడా, గౌలీపురా, సుల్తాన్‌ షాహీ, బేలా ముత్యాలమ్మ, మీరాలం మండితో పాటుగా మరో 25 ప్రధాన దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసింది. ఆదివారం బోనాలు, సోమవారం రంగం కార్యక్రమాలను నిర్వించనున్నారు. అలాగే కాకతీయుల నిర్మించి, నిజాంరాజులతో పూజలందుకుని తరతరాలుగా గోల్కొండ పటేళ్ల నిర్వహణలో ఉన్న ట్యాంక్‌ బండ్‌ కట్టమైసమ్మ బోనాల ఏర్పాట్లను పటిష్టంగా ప్రభుత్వం చేసింది. ఆషాఢ మాసంలో గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైన బోనాలు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట అమ్మవారి ఆలయం దాటి పైదరాబాద్‌ పాతబస్తీలోని సింహవాహిని ప్రాచీన దేవాలయాల్లో ఆదివారం, సోమవారం జరిగే బోనాలతో ఆషాఢమాస బోనాలు ముగియనున్నాయి.

Old Basti Bona..tight security arrangements

ప్రాచీన ఆచారాలు

ఇదిలాంటే హైదరాబాద్‌ తట్టితేనే చాలు ప్రాచీన ఆచారాలు, శాతబ్దాల క్రితం నాటి ఆలయాలు, సంప్రదాయులు కళ్ళముందు కదలాడుతాయి. కాకతీయుల కాలం నాటి సంప్రదాయాలను కుతుబ్‌ షాహీలు, నిజాంరాజులు కొనసాగించడంతో ఆనాటి సంప్రదాయాలు నేటికి సమాజంలో ఆచరణీయమయ్యాయి. కాకతీయ గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రునికాలంలో వర్షాకాలం ప్రారంభంలో గ్రామదేవతలకు బోనం సమర్పించి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే ఆచారం ఉండేది. అంటువ్యాధులు వ్యాపించకుండా అమ్మవారిని శక్తి కొలదిగా పూజించి బోనాలు సమర్పించడం ఆనాటి ఆచారంగా ఉన్నట్లు చరిత్ర చెపుతోంది. ఈ ఆచారం ప్రజల్లో మిళితమై నేటికి వర్ధిల్లుతుందనడానికి ఆషాఢ మాస బోనాలు అద్దం పడుతున్నాయి. ప్రకృతిని ఆరాధించి అమ్మవారిని పూజించే ఆచారం నేటికి తెలంగాణలో ఉందనడానికి బోనాలు నిదర్శనం. బోనం అంటే భోజనం అమ్మవారికి భోజనం సమర్పించడాన్నే బోనం అంటారు. సకలజీవులకు ఆహారం అందించే గ్రామదేవతలకు బోనం సమర్పించడం ఈ పండుగలోని ప్రత్యేకత. 1813లో హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి ప్రభలినప్పుడు వ్యాధిని తరిమి వేయాలని హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లో అమ్మవారికి బోనాలు సమర్పించిన చరిత్ర ఉంది.

అమ్మవారికి ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని ప్రధాన ఆలయాలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రతావలయాన్ని పాతబస్తీలో ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జరిగిన బోనాలకంటే అత్యధికంగా భక్తులు పాల్గొనే అవకాశాలతో పాటు సెలబ్రేటీలు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం నిరంతరం భద్రతా చర్యలను చేపట్టింది.

పోలీసుల ట్రాఫిక్‌ ఆంక్షలు

పాతబస్తీలోని పలుప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రధానంగా ప్రాచీన దేవాలయల రహదారుల్లో ప్రముఖల రాకపోకలుండటంతో ట్రాఫిక్‌ ఆంక్షలతో పాటుగా భద్రతావలయాలను రూపొందించారు. ఆది,సోమవారాల్లో పాతబస్తీ, అంబర్‌పేట,చార్మినార్‌, మీర్‌చౌక్‌నూమా, నయాపూల్‌, బహుద్దూర్‌పుర పోలీసు స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు చార్మినార్‌, ఫలక్‌నూమా, ఓల్డ్‌ సీబీస్‌, అఫ్జల్‌గంజ్‌, దారుల్‌షఫా, ఇంజన్‌ బౌలిలో బస్సురూట్లను మళ్లించారు. ఈ ఆంక్షలు 16వతేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం వరకు అమల్లో ఉంటాయి. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న బోనాల జాతర సందర్భంగా బోనాలు జరిగే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి బోనాలు ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు