/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/beeruvas-money-jpg.webp)
కట్టలకు కట్టల డబ్బులు..కాదు కాదు..గుట్టలకు గుట్టల నోట్ల కట్టలు..500, 200, 100రూపాయల నోట్లు. ఎస్. ఒడిశా(Odisha)లో జరిగిన ఐటీ దాడుల్లో..ఏ కోటో..రెండు కోట్లో కాదు. ఏకంగా వందల కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. వాటిని లెక్కించలేక కౌంటింగ్ మెషీన్లు కూడా మొరాయించాయంటే ఎన్ని వందల కోట్లు దొరికాయో ఊహించడం కూడా కష్టంగానే మారింది.
I have #NeverSeen anything like this; if you are a regular mortal, you havent either; my colleague @mukeshmukeshs shares video from #ITRaid in #Jharkhand where at least Rs 200 crore was caught; counting is still on; Did you say India was poor? Yes, in morality @ndtv @ndtvindia pic.twitter.com/Mv1HKMQifk
— Uma Sudhir (@umasudhir) December 8, 2023
ఐటీ శాఖకు చెందిన 36 బృందాలు ఒడిశా, జార్ఖండ్, బెంగాల్లోని 36 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/money1-1-jpeg.webp)
రూ.250 కోట్లకు పైగా నగదు:
ఒడిశా బోలంగీర్, సంబల్పూర్, జార్ఖండ్లోని రాంచీ, లోహర్దగా ఏరియాలోని లిక్కర్ కంపెనీలకు చెందిన ఆఫీసులు, ఇళ్లలో రైడ్స్ నిర్వహించారు ఐటీ అధికారులు. బీరువాల్లో దాచిన కోట్ల రూపాయల నగదు చూసి అధికారులే షాకయ్యారు. 9 బీరువాల్లో గుట్టలకు గుట్టల నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కపెడుతుండగా కొద్దిసేపటికే మొరాయించాయి కౌంటింగ్ మెషీన్లు. ఇప్పటివరకు మొత్తం 250 కోట్లకు పైగా నగదు లెక్కించామని..ఇవాళ(డిసెంబర్ 8) కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు ఐటీ అధికారులు. లెక్కించిన నగదును 157 బ్యాగుల్లో నింపి ట్రక్కుల్లో బ్యాంకుకు తరలించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/money1-4-jpeg.webp)
బంగారం కూడా:
జార్ఖండ్కు చెందిన ఓ ఎంపీతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో పట్టుబడిన నగదు విలువ మొత్తం 510కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఐతే దీంతోపాటు భారీగా బంగారం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. డబ్బుల లెక్కలు కంప్లీట్ అయ్యాక గోల్డ్ ఆర్నమెంట్స్ను లెక్కించనున్నట్టు సమాచారం. లిక్కర్ వ్యాపారి జార్ఖండ్ నుంచి వచ్చి ఒడిశాలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని..సంస్థకు భారీ నష్టం వాటిల్లినట్టు చూపి సొమ్మును పక్కదారి పట్టించినట్టు ఆరోపణలున్నాయి. మరోవైపు పన్ను ఎగవేత ఆరోపణలుండటంతో సోదాలు నిర్వహించారు. రెండ్రోజుల పాటు జరిపిన దాడుల్లో వందల కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. పెద్ద మొత్తంలో దొరికిన నగదును సీజ్ చేశారు ఐటీ అధికారులు.
Also Read: నాసిరకం పిచ్లు.. పరువు తీసిన బీసీసీఐ.. ఐసీసీ షాకింగ్ రిపోర్ట్!
WATCH: