Andhra Pradesh : ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి రాగానే పెన్షన్లను పెంచుతామని హామీ ఇవ్వడం… ఆ హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన విషయం గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa) సామాజిక పింఛన్ల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లను రెడీ చేశారు. ఈరోజు (జూలై 1) ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం పెనుమాకలో పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి చేరుకున్నారు. స్వయంగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా తొలిపెన్షన్ అందించారు. పెనుమాకలో (Penumaka) నివాసం ఉంటున్న వృద్ధుడు బనావత్ నాయక్ కు మొదటి పెన్షన్ అందించారు చంద్రబాబు. ఆ తరువాత ఆయన కుమార్తెకు వితంతు పెన్షన్ ను అందచేశారు.
పూర్తిగా చదవండి..NTR Bharosa : ఏపీలో ప్రారంభమైన పెన్షన్ల పండుగ..పెనుమాకలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి పెన్షన్!
ఏపీలో పెన్షన్ల పండుగ ప్రారంభమైంది. పెనుమాకలో సీఎం చంద్రబాబునాయుడు తొలి పెన్షన్ అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా పెన్షన్లను అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొల్లపల్లి లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు
Translate this News: