PM Modi Poland, Ukrain Visit: పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ పంపిన ఆహ్వానాల మేరకు భారత ప్రధాని మోదీ ఆ రెండు దేశాల్లో పర్యటించనున్నారు. 30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని మొదటిసారిగా ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవలే మోదీ రష్యాలో పర్యటించి…ఆదేశ అధ్యక్షుడు పుతిన్ను కలిశారు. రష్యాతో తమకు ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉందని చెప్పారు అన్నికాలాల్లో రష్యా తమకు మిత్రదేశమేనని తెలిపారు. మరోవైపు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యని పరిష్కరించుకోవాలని పదేపదే భారత్ చెబుతోంది. యుద్ధం ప్రస్తుత కాలంలో పరిష్కారం కాదని ప్రధాని మోదీ చాలాసార్లు చెప్పారు.
పూర్తిగా చదవండి..PM Modi: పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ
ప్రధాని మోదీ పోలాండ్, ఉక్రెయిన్ పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. ఆగస్టు 21 నుంచి నుంచి 23 వరకు రెండు దేశాల్లో పర్యటించనున్నారు. రీసెంట్గా రష్యాలో పర్యటించిన ప్రధాని ఇప్పుడు ఉక్రెయిన్కు వెళుతుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.
Translate this News: