CM Revanth Reddy: రేవంత్ రెడ్డితో నోకియా జర్మనీ ప్రతినిధి బృందం భేటీ

TG: రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో నోకియా జర్మనీ ప్రతినిధి బృందం భేటీ అయింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు నోకియా సంస్థ సిద్దమైనట్లు తెలుస్తోంది. అందుకోసమే సీఎంతో భేటీ అయినట్లు సమాచారం.

New Update
CM Revanth Reddy: రేవంత్ రెడ్డితో నోకియా జర్మనీ ప్రతినిధి బృందం భేటీ

CM Revanth Reddy: నోకియా ఎంటర్‌ప్రైజెస్ మేనేజ్‌మెంట్‌ హెడ్‌ మార్టీన్ (Martin Beltrop) నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయింది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో నోకియా గ్లోబల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్ డైరెక్టర్ వెంకట్‌ ఎస్ నారాయణయ్య, సేల్స్‌ గ్లోబల్‌ హెడ్‌ మయాంక్ భాటియా, ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్స్ ఇండియా సేల్స్ మేనేజర్ రాకేష్‌, క్వాడ్జెన్ చైర్మన్ సీఎస్‌ రావు, యూఎస్ఎం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పద్మజ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

CM Revanth Reddy Met Nokia Enterprises Management Head Martin Beltrop

Advertisment
తాజా కథనాలు