/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Nirmala-sitharaman-jpg.webp)
Nirmala Sitharaman: బడ్జెట్లో సొంత ఇళ్లు లేనివారికి కేంద్రం ప్రభుత్వం తీపి కబురు అందించింది. పట్టణాల్లో గృహ నిర్మాణానికి 2.2 లక్షల కోట్లను కేటాయించింది. 100 పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. అలాగే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది. ఈసారి బడ్జెట్ లో అణు విద్యుత్పై ప్రత్యేక దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. కొత్త రియాక్టర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మరో 3 కోట్ల ఇళ్లను నిర్మించనుంది. పట్టణాల్లో కోటి ఇళ్ల నిర్మాణం చేపడుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.