BUDGET 2024: భూముల పరిరక్షణ కోసం కొత్త పథకం.. కీలక ప్రకటన

భూముల పరిరక్షణ కోసం డిజిటల్ భూ-ఆధార్‌ను తీసుకరానున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీలేని రుణాలు, స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు.

New Update
BUDGET 2024: భూముల పరిరక్షణ కోసం కొత్త పథకం.. కీలక ప్రకటన

Nirmala Sitharaman: బీహార్‌లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం పెద్దపీట వేసింది. రోడ్ల నిర్మాణానికి రూ.26,000కోట్లు ప్రకటించింది. రాజ్‌గిరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించనుంది. నలంద యూనివర్సిటీని టూరిస్ట్‌ సెంటర్‌గా అభివృద్ధి చేస్తామని నిర్మల తెలిపారు. భూముల పరిరక్షణ కోసం డిజిటల్ భూ- ఆధార్ ను తీసుకరానుంది. రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు