మణిపూర్లో హింస ఆగడం లేదు. నెలన్నర గడిచినా పరిస్థితి మెరుగుపడడం లేదు. మంగళవారం అర్థరాత్రి రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగింది. హింసాకాండ సందర్భంగా కాల్పులు జరిగాయి. బుల్లెట్ గాయాల కారణంగా 9 మంది మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాజధాని ఇంఫాల్లో నిన్న రాత్రి 10 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు ఎస్పీ శివకాంత సింగ్ తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో తొమ్మిది మంది మరణించినట్లు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..మణిపూర్ మళ్లీ హింస..కాల్పుల్లో 9మంది మృతి, 10మందికి గాయాలు..!!
Translate this News: