మావోయిస్టుల సానుభూతిపరులన్న ఆరోపణలపై ఎస్ఐఏ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఏకకాలంలో దాదాపు అరవై రెండు చోట్ల సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామున 5.30 గంటల నుంచే తెలంగాణలో తొమ్మిది, ఆంధ్రప్రదేశ్లో 53 ప్రాంతాల్లో పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు తదితర ఇళ్లల్లో సోదాలు చేశారు.
పూర్తిగా చదవండి..తెలంగాణలో 9 చోట్ల ,ఆంధ్రాలో 53 చోట్ల సోదాలు:
ఆంధ్రప్రదేశ్ సత్య సాయి జిల్లాలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు చంద్ర నర్సిం హులును అరెస్టు చేసి, పిస్టల్తో పాటు 14 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కడపలో ఓ వ్యక్తిని అదుపు లోకి తీసుకొని రూ.13 లక్షలు సీజ్ చేశారు. తనిఖీల్లో డాక్యుమెంట్లు, కంప్యూటర్ పలు , సీడీలు, డీవీడీలు, పుస్తకా లను సీజ్ చేశారు. హైదరాబాద్ విద్యా నగర్ లో ఉంటున్న న్యాయవాది సురేషుకు విచారణకు రావాల్సిందిగా..సూచిస్తూ నోటీసులు జారీ చేశారు. 2021 మార్చి 31న రెండు రాష్ట్రాలకు చెందిన 31 మంది ప్రజా సంఘాలు, పౌరహక్కుల నేతల ఇళ్లపై ఎన్ఐఏ దాడులు చేసి ఆరుగురిని అరెస్టు చేసింది.
పలువురు అరెస్ట్:
గుంటూరు జిల్లా పొన్నూరు ప్రజా వైద్య కళాశాలలో తనిఖీలు జరిపిన ఎస్ఐఏ అధికారులు నెల్లూరులో ఏపీ సీఎల్సీ ప్రధాన కార్యదర్శి వెంకటే శ్వర్లు, అరుణ నివాసాల్లో, తిరుపతి లోని న్యాయవాది క్రాంతి చైతన్య ఇంట్లో, గుంటూరులో డాక్టర్ జా రావు నివాసంలో సోదాలు చేశారు. విజయవాడలో విప్లవ రచయితల సంఘం నేత అరసవల్లి కృష్ణ, రాజ మండలం బొమ్మూరు మండ్రి రూరల్ లో కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు కోనాల లాజర్, సంత మాగులూరులో శ్రీనివాసరావు, విశాఖ ఎంవీపీ కాలనీలో ఎస్ఆర్ఎఫ్ ప్రతినిధి శ్రీను, మంగళగిరి మండలం, గన్నవరంలోని అమ్మిసెట్టి రాధా. తాడేపల్లి బత్తుల రమణయ్య ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. హైద రాబాద్ అల్వాల్లో బంధుమిత్రులు సంఘం సభ్యుల నివాసాల్లో సోదాలు
ఎస్ఐఏ అరెస్టు చేసిన వారితోపాటు నిందితులుగా పేర్కొన్న వారి తరఫున న్యాయవాది సురేశ్ వాదనలు వినిపిస్తున్నారు. ఎస్ఐఏ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో ఎస్ఐఏ అధి కారులు ఆయన నివాసంలో సోదా లు జరిపారు. పలు కీలక డాక్యుమెం ట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 9న విచారణకు రావాల్సిం హార్ట్ దిగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందించిన న్యాయవాది సురేష్న్యయ పోరాటం ద్వారానే ఎస్ఐఏ అధికారుల కేసులను ఎదుర్కొంటామని చెప్పారు. పొన్నూరులో డాక్టర్ రావును ప్రశ్నించారు.
చీమకుర్తిలో దుడ్డు వెంకట్రావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. షాద్ నగర్ నివాసి పీకేఎం నాయకుడు రాంచందర్. కావలికి చెందిన కేఎన్పీఎస్ నాయకులు బాలయ్య, దుడ్డు వెంకటరావు, ఓర్సు శ్రీనివాస్ రావు ఇళ్లపైనా దాడులు చేశారు. అల్వాల్ ప్రాంతంలోని సుభాష్నగర్లో ఉంటున్న బంధుమి త్రుల సంఘం నాయకురాలు భవానీ, నెల్లూరు జిల్లా పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 53 చోట్ల దాడులు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాడులను పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు ఖండించారు.
ALSO READ: రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసు.. మాజీ మంత్రి బండారుకు బెయిల్!
[vuukle]