New Twist in Inter Student Ritu Sahu Incident in Visakhapatnam: విశాఖ పట్నంలోని బెంగాల్ స్టూడెంట్ రితు సాహు కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఘటన జరిగిన నెలన్నర తర్వాత ఈ కేసును హత్య కేసుగా పోలీసులు మార్చారు. బాలిక మృతిపై రోజు రోజుకూ అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ కేసులోకి బెంగాల్ పోలీసులు ఎంట్రీ ఇచ్చాక.. మొత్తం కేసు స్టడీనే మారిపోయింది. ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదంటూ.. విద్యార్థిని తల్లితండ్రులు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి, ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకోవాలని పోలీసులకు సీఎం మమతా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కోల్ కతాలోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో విశాఖలో విద్యార్ధిని హత్యకు గురైనట్లు గతంలో సెక్షన్ 302 కింద కేసు నమోదైంది.
పూర్తిగా చదవండి..New Twist in Student Ritu Sahu Incident: వెస్ట్ బెంగాల్ మైనర్ బాలిక కేసులో కొత్త ట్విస్ట్.. నెలన్నర తర్వాత కీలక మలుపు!!
వైజాగ్ కు చేరుకున్న బెంగాల్ పోలీసులు.. హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాశ్ సంస్థ, వైద్య సహాయం చేసిన ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం, వారి పాత్రపై విచారణ మొదలు పెట్టారు. అనంతరం ఓ క్లారిటీకి వచ్చాక గురువారం రితు సాహు మృతిపై సెక్షన్ 174 నుంచి ఐపీసీ 304 పార్ట్ 2గా మార్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు విశాఖ పోలీసులు. రిపోర్టు ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగనుంది. ఇన్ని రోజులు రితు సాహు ది ఆత్మహత్యగా భావించిన విశాఖ పోలీసులు.. అనుమానస్పద మృతిగా సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. ఇక కాలేజీ, హాస్టల్ యాజమాన్య నిర్లక్ష్యంగా ఉన్నట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాశ్ సంస్థ, వైద్యం చేసిన డాక్టర్ల పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టారు.
Translate this News: