Telangana Arogyasri: యూనిక్ ఐడీతో కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు.. ఆ వైద్య సేవలు కూడా ఫ్రీ!

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దిశగా రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆరోగ్య శ్రీకి, రేషన్‌కార్డుకు లింకు పెట్టొద్దని ఇప్పటికే అదేశాలు జారీ చేయగా.. యూనిక్ ఐడీతో కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది.

Telangana Arogyasri: యూనిక్ ఐడీతో కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు.. ఆ వైద్య సేవలు కూడా ఫ్రీ!
New Update

Arogyasri: తెలంగాణ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తులు మొదలుపెట్టింది. అందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్య శ్రీకి, రేషన్‌కార్డుకు లింకు పెట్టొద్దని అదేశాలు జారీ చేసింది. రేషన్‌కార్డు, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ స్కీమ్‌ను వర్తింపజేయాలని సీఎం అధికారులకు సూచించారు. స్కీమ్‌లో లబ్ధిదారులను గుర్తించి రాజీవ్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కొత్త కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే కార్డుల తరహాలోనే, ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని యూనిక్ ఐడీతో ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

చెన్నై తరహా ఇంప్లిమెంటేషన్‌‌‌‌‌‌‌‌..

కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ సపరేట్ నంబర్ ఇచ్చి, ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్‌కు లింక్ చేసి, స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేయనుండగా ఇప్పటికే రెండుసార్లు చెన్నైకి వెళ్లి అక్కడ స్కీమ్ అమలవుతున్న తీరును ఆఫీసర్లు అధ్యయనం చేశారు. స్కీమ్ ఇంప్లిమెంటేషన్‌‌‌‌‌‌‌‌ కోసం ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చినట్లు సమాచారం. ట్రామా కేర్ ప్యాకేజీని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ ఎంపానల్‌‌‌మెంట్ ఉండి, స్పెషాలిటీ సర్వీసెస్ అందుబాటులో ఉన్న హాస్పిటల్స్‌‌‌‌ను ట్రామా కేర్‌‌‌కు ఉపయోగించుకోవచ్చునని ఆఫీసర్లు చెబుతున్నారు. మల్టిపుల్ ఇంజూరి కేసులకు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స చేయడం లేదు. ట్రామాకేర్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే, ఈ సమస్యకు కూడా పరిష్కారం దొరకనుంది. యాక్సిడెంట్లు, స్ట్రోక్స్‌‌‌‌, సూసైడ్స్ తదితర ఎమర్జెన్సీ కండీషన్‌‌ పేషెంట్లకు ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఉచితంగా చికిత్స అందేలా ట్రామా కేర్ ప్యాకేజ్‌‌‌‌ ‌‌‌‌ ను తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తోంది. ట్రామా కేర్ లో అడ్మిట్ అయ్యే పేషెంట్స్ రూ.లక్ష వరకు చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. గోల్డెన్ హవర్​లో ట్రీట్మెంట్ అందించి పేషెంట్‌‌‌‌ ‌‌‌‌ ప్రాణాలను కాపాడడమే ఈ స్కీమ్ ఉద్దేశం.

ఇంకో రూ.400 కోట్లు అదనంగా..

ఇదిలా ఉంటే.. యేడాదికి ఆరోగ్యశ్రీ ఖర్చు రూ.1,100 కోట్లు అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ స్కీమ్‌‌ అందరికీ వర్తింపజేస్తే ఇంకో రూ.400 కోట్లు అదనంగా ఖర్చు కాబోతున్నట్లు అంచనా వేశారు. తెలంగాణలో 1.3 కోట్ల కుటుంబాలుండగా 90 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. మిగిలిన 40 లక్షల కుటుంబాల్లో దాదాపు 15 లక్షల కుటుంబాలకు కొత్తగా తెల్ల రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత ఆదాయ వర్గాల కుటుంబాలకు ఈహెచ్‌‌‌‌ఎస్‌‌, పోలీసులకు ఆరోగ్య భద్రత, సింగరేణి వంటి కార్పొరేషన్ల ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్‌‌ స్కీములున్నాయి. సాఫ్ట్‌‌‌‌ వేర్, ప్రైవేటు ఉద్యోగులు సొంతగా హెల్త్ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారు. దీంతో కేవలం పేదలు మాత్రమే ఆరోగ్యశ్రీ స్కీమ్‌‌ వినియోగించుకుంటున్నారని, ఇప్పుడు అందరికీ వర్తింపచేసినా పెద్దగా ఆర్థిక భారం పడే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.

ఇక ఈహెచ్‌‌ఎస్‌‌‌ కోసం కొత్తగా ఓ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉచితంగా కాకుండా నెల నెలా కొంత మొత్తాన్ని తామే ప్రభుత్వానికి ఇస్తామని, అది జమ చేసి హెల్త్ స్కీమ్‌‌ అమలు చేయాలని‌ ‌‌కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్‌‌‌‌ఎస్ గవర్నమెంట్ ఇందుకు అనుగుణంగా ఓ జీవోను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాలకు సేవలు అందించడాన్ని గవర్నమెంట్ వ్యతిరేకించే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ అమలులో పలు లోపాలు, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, ట్రీట్‌‌‌‌ మెంట్ చేయడానికి ప్రైవేటు హాస్పిటళ్లు నిరాకరిస్తుండడం తదితర సమస్యలెన్నో ఉన్నట్లు అధికారులు సూచించారు.

#telangana #unique-id #cm-revanth #arogya-shree-cards
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe