/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T154545.208.jpg)
Director Ajay Sastry : టాలీవుడ్ లో విషాదం నెలకొంది. మంచు మనోజ్ తో 'నేను మీకు తెలుసా?' (Nenu Meeku Telusa) అనే సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు అజయ్ శాస్త్రి ఇటీవల కన్ను మూసారు. ఆయన మరణంపై మంచు మనోజ్ (Manchu Manoj) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజయ్ శాస్త్రి మృతితో తనకు తీవ్ర షాక్ అయ్యామని, మాటలు రావడం లేదని భావోద్వేకంతో పోస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనతో దిగిన ఫొటోలను పంచుకుంటూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
' నా బెస్ట్ ప్రెండ్, ‘నేను మీకు తెలుసా?’ దర్శకుడు అజయ్ శాస్త్రి ఇక లేరనే వార్త కలచి వేస్తోంది. మాటల్లో వర్ణించలేనంత బాధగా ఉంది. ఆయన కుటుంబసభ్యులకు, ఆత్మీయులకు ధైర్యాన్నివాలని భగవంతుడిని కోరుకుంటున్నా. చాలా త్వరగా వెళ్లిపోయావ్ అజయ్. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. ఇది కల అయితే బాగుండనిపిస్తోంది. నువ్వు లేకుండా జీవితం ఎప్పటిలా ఉండదు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను' అని మంచు మనోజ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
Heartbreaking to inform that my best friend and the Captain of Nenu Meeku Telusa is no more. No words can describe the pain we r enduring. Praying lord shiva to give strength to his family and loved ones. Om Shanti.
Will miss you ra Ajay, gone too soon. Wishing this is a dream.… pic.twitter.com/zxjPjdi2Tw— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 2, 2024
Also Read : బాలయ్య 50 ఇయర్స్ సినీ జర్నీ ఈవెంట్ కు ఎన్టీఆర్ వస్తాడా?
కాగా అజయ్ శాస్త్రి డైరెక్ట్ చేసిన 'నేను మీకు తెలుసా' మూవీ 2008లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత అజయ్ శాస్త్రి మరో సినిమాను డైరెక్ట్ చేయలేదు. అందుకు కారణాలు తెలియకపోయినా ఈ దర్శకుడి అకాల మరణం సినీ విశ్లేషకులను సైతం దిగ్బ్రాంతికి గురి చేసింది.