West Bengal: రెడ్ లైట్‌ ఏరియాలో దుర్గామాత విగ్రహాం..ఎందుకు?

ఆసియాలో అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో ఉంది. దీని పేరు సోనాగాచి. ఈ రెడ్ లైట్ ఏరియాలోని మట్టిని దుర్గామాత విగ్రహం తయారీకి వాడే ఆనవాయితీ చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది.

New Update

West Bengal: నిజానికి భారతదేశంలో వ్యభిచారం చట్టవిరుద్ధం. అయినప్పటికీ.. ఢిల్లీ నుంచి కలకత్తా వరకు, మహారాష్ట్ర నుంచి బీహార్ వరకు ఈ వ్యాపారం యథేచ్ఛగా జరుగుతుంది. అంతే కాదు, ఆసియాలో అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా కూడా భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో ఉంది. దీని పేరు సోనాగాచి. ఈ రెడ్ లైట్ ఏరియాలోని మట్టిని దుర్గామాత విగ్రహం తయారీకి వాడే ఆనవాయితీ చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది. 

Also Read: మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

అయితే, దుర్గామాత విగ్రహం కోసం ఇక్కడి మట్టికి ఇచ్చే గౌరవం, ఈ ప్రాంతపు మహిళలకు ఉండదు. అందుకే, దుర్గామాత విగ్రహాన్ని తయారు చేసేందుకు.. తమ ప్రాంగణంలోని మట్టిని ఇచ్చేందుకు ఇక్కడి మహిళలు నిరాకరించారు. దీంతో.. ఈ ప్రదేశం వెలుగులోకి వచ్చింది. ఓ వైపు మహిళా సాధికారత అంటూ ప్రపంచం పరుగులు పెడుతుంటే.. దేశంలో ఇంకా ఇలాంటి దయనీయ,దౌర్భాగ్య ప్రాంతాలు ఉండటం సిగ్గుచేటు.

Also Read: "32 రోజులు" అంటూ ఆగిపోయిన కమలా హారిస్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు