supreme court: ఇంక ఓపిక లేదు..రేషన్ కార్డుల వ్యవహారంపై సుప్రీం అసహనం

రేషన్ కార్డుల జాప్యం మీద సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వలస కార్మికులు అన్ని వివరాలు నమోదు చేసుకున్నా కేంద్రపాలిత రాష్ట్రాలు కార్డులు జారీ చేయడం లేదు.దీనిపై అక్కడ ప్రభుత్వాల తీరు ఆందోళనకరంగా ఉందని...తమ ఓపిక నశించిందని కోర్టు వ్యాఖ్యానించింది. 

author-image
By Manogna alamuru
New Update
Supreme Court 3

Supreme Court: 

వలస కార్మికులకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రేషన్ కార్డులను జారీ చేయడం లేదు. వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు కరోనా సమయంలో 2020లో సుమోటాగా విచారణ చేపట్టింది. దీని పలు సార్లు విచారణ చేసింది. ఈ క్రమంలో జాతీయ ఆహార భద్రత చట్టం కింద.. కోటాతో సంబంధం లేకుండా ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న దాదాపు 8 కోట్ల వలస కార్మికులకు రేషన్‌ కార్డులు జారీ చేయాలని 2021లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అయితే ఈ ఆదేశాలను ఇప్పటి వరకు కొన్ని రాష్ఠ్​రాలు మాత్రమే పాటించాయి. మిగతా రాష్‌ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వలస కార్మికులు రేషన్ కార్డులను ఇవ్వలేదు. దీని మీద న్యాయస్థనం ఇప్పటికే పలుసార్లు చెప్పింది. ఈసరి మరోసారి ఈ విషయం మీద విచారణ చేసిన సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఇందులో అంత ఉదాసీనంగా ఉడడనికి ఏముంది...ఎందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేడం లేదంటూ వ్యాఖ్యానించింది. ఈ అంశంలో ఎలాంటి ఉదాసీనతకు చోటు లేదని స్పష్టం చేసింది. ఇక తమకు ఓపిక నశించిందని..అందుకే మా ఉత్తర్వులను పాటించేందుకు మీకు చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. లేదంటే మీ కార్యదర్శులు కోర్టుకు రావాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ వ్యవహారంపై నవంబరు 19లోగా కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

 

 

 

 

 

 

 

 

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు