/rtv/media/media_files/2026/02/01/hyderabad-2026-02-01-11-42-08.jpg)
కేంద్ర బడ్జెట్ 2026లో మోదీ సర్కార్ భారీ నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానిస్తూ ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను (High-Speed Rail Corridors) అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ కేంద్రంగా మూడు కారిడార్లు రావడం విశేషం.
7 హైస్పీడ్ కారిడార్లు ఇవే:
ముంబయి - పుణె: మహారాష్ట్రలోని రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణం మరింత సులభం కానుంది.
పుణె - హైదరాబాద్: పశ్చిమ, దక్షిణ భారత వాణిజ్య కేంద్రాల మధ్య వేగవంతమైన ప్రయాణం.
హైదరాబాద్ - బెంగళూరు: ఐటీ హబ్లైన ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గనుంది.
హైదరాబాద్ - చెన్నై: తెలుగు, తమిళ రాష్ట్రాల రాజధానుల మధ్య హైస్పీడ్ కనెక్టివిటీ.
చెన్నై - బెంగళూరు: దక్షిణాదిలోని రెండు కీలక పారిశ్రామిక నగరాల అనుసంధానం.
ఢిల్లీ - వారణాసి: ఉత్తర భారతదేశంలో పర్యాటక, ఆధ్యాత్మిక రంగానికి బూస్ట్.
వారణాసి - సిలిగుడి: తూర్పు భారతాన్ని కలిపే కీలకమైన కారిడార్.
మొత్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.12.2 లక్షల కోట్లను కేటాయించారు. ఈ భారీ నిధులతోనే హైస్పీడ్ కారిడార్ల వంటి మెగా ప్రాజెక్టులను పట్టాలెక్కించనున్నారు. పర్యావరణహితంగా, తక్కువ కార్బన్ ఉద్గారాలతో ఈ రైల్వే ప్రాజెక్టులను నిర్మిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
Follow Us