Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడి.. ఇద్దరిని అరెస్టు చేసిన NIA

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో కీలక పురోగతి లభించింది. ఈ దాడికి పాల్పడిన వారికి ఆశ్రయం ఇచ్చిన పర్వాజ్, అహ్మద్ జోతార్ అనే ఇద్దరిని NIA అరెస్టు చేసింది. వారిని విచారించగా ఈ దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఆధారాలందించారు.

New Update
NIA Arrests Two For Sheltering Terrorists Behind Pahalgam Attack

NIA Arrests Two For Sheltering Terrorists Behind Pahalgam Attack

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో కీలక పురోగతి లభించింది. ఈ దాడికి పాల్పడిన వారికి ఆశ్రయం ఇచ్చిన పర్వాజ్, అహ్మద్ జోతార్ అనే ఇద్దరిని NIA అరెస్టు చేసింది. వారిని విచారించగా ఈ దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఆధారాలందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

అది ఏప్రిల్ 22. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అమాయకులైన 26 మందిని హతమార్చారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసింది. 

Pahalgam Terror Attack

దీంతో భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అనంతరం రెండు మూడు రోజులకే కాల్పుల విరమణ జరిగింది. అయితే ఈ టెర్రరిస్టు అటాక్‌ను సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం.. దీనికి సంబంధించిన కేసు విచారణను NIAకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ అధికారులు జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 

ఇందులో భాగంగా దర్యాప్తును వేగవంతం చేయగా.. నేడు కీలక పురోగతి లభించింది. ఈ ఉగ్ర దాడికి పాల్పడిన వారికి ఆశ్రయం ఇచ్చిన ఇద్దరిని NIA అరెస్టు చేసింది. పహల్గామ్‌లోని బాట్‌కోట్‌కు చెందిన పర్వేజ్ అహ్మద్ జోథర్, హిల్ పార్క్ నుండి బషీర్ అహ్మద్ జోథర్‌లను ఈ రోజు తెల్లవారుజామున NIA  అరెస్టు చేసింది. ఆపై వారిని తమదైన రీతిలో విచారించగా సంచలన విషయాలు వెల్లడించారు. పహల్గామ్ ఉగ్ర దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్టులు ఉన్నట్లు నిందితులు ఆధారాలు అందించారు. వీటితో NIA తమ విచారణను మరింత వేగవంతం చేయనున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు