Sitaram Yechury: ఏచూరి మృతికి మోదీ, రాహుల్ తో పాటు ప్రముఖుల సంతాపం

సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా కూడా ముద్ర వేశారని ప్రధాని కొనియాడారు. మంచి మిత్రుడిని కోల్పోయానని రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు.

author-image
By Vishnu Nagula
New Update
sitaram Yechury

సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా కూడా ముద్ర వేశారని ప్రధాని కొనియాడారు. మంచి మిత్రుడిని కోల్పోయానని రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. జాతీయ స్థాయికి ఎదిగిన అతికొద్ది మంది తెలుగువారిలో ఏచూరి గారి ప్రస్థానం ప్రత్యేకమైనదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అతను భారతదేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన గొంతుకలలో ఒకరని చంద్రబాబు అన్నారు. 

 

Advertisment
తాజా కథనాలు