/rtv/media/media_files/2025/11/12/terror-attack-2025-11-12-09-19-57.jpg)
హర్యానాలోని ఫరీదాబాద్లో పోలీసులు, భద్రతా సంస్థలు ధ్వంసం చేసిన ఉగ్రవాద మాడ్యూల్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి, మాస్టర్మైండ్ ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్గా గుర్తించారు. అతను జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ నివాసిగా తేల్చారు. వైద్య విద్యార్థులను తీవ్రవాదంగా మార్చడంలో అహ్మద్ కీలక పాత్ర పోషించాడని, వారిని తీవ్రవాద భావజాలం వైపు నెట్టారని విచారణలో తేల్చారు.
ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ గతంలో శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా పనిచేశారు. నౌగామ్లోని ఒక మసీదులో కలిసిన అనేక మంది విద్యార్థులతో ఆయన సంబంధాలు కొనసాగించారు. ఫరీదాబాద్లోని వైద్య విద్యార్థులను అహ్మద్ క్రమంగా తీవ్రవాద ఆలోచనలతో ప్రభావితం చేశాడని, పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ అతనికి స్ఫూర్తినిచ్చిందని వారు తెలిపారు.
కశ్మీర్ వంటి ప్రాంతాల్లోని పరిస్థితులను, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్నట్లుగా వారు భావిస్తున్న అన్యాయాలను ప్రస్తావిస్తూ, విద్యార్థులలో భావోద్వేగాలను రెచ్చగొట్టి, వారిని ఉగ్రవాద చర్యలకు ప్రేరేపించారన్నారు. వైద్య కళాశాలలు మరియు హాస్పిటల్స్ వంటి చోట్ల తమకు ఉన్న పరిచయాలను ఉపయోగించి, తమతో కలిసి పనిచేసే లేదా తమ కింద చదువుకునే విద్యార్థులను, జూనియర్ డాక్టర్లను లక్ష్యంగా చేసుకున్నారని తేల్చారు.
వైద్య విద్యార్థులను కేవలం ప్రచారం కోసం మాత్రమే కాకుండా, ఏకే-47 రైఫిళ్లు, పిస్టల్స్, 2,900 కిలోల బాంబు తయారీ సామాగ్రి (అమ్మోనియం నైట్రేట్ వంటివి) తరలించడం వంటి నేరుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేలా చేశారు.
జైషే మహ్మద్ వీడియోలను
ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ తన -స్టూడెంట్ లకు జైషే మహ్మద్ వీడియోలను రోజూ చూపించి మోటివేట్ చేసేవాడని తెలిపారు. అహ్మద్ డేటా కనెక్షన్ ఉపయోగించి చేసిన కాల్స్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లోని కొంతమందితో సంప్రదింపులు జరిపేవాడని పోలీసులు వెల్లడించారు. విద్యార్థుల మనస్సులలో తీవ్రవాద ఆలోచనలను లోతుగా చొప్పించడమే అతని లక్ష్యంగా పెట్టుకున్నాడని తెలిపారు. ముజమ్మిల్ షకీల్, మహ్మద్ ఉమర్ అనే ఇద్దరు వైద్యులు ఈ మిషన్ను చురుకుగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిసిందన్నారు. మొత్తం మాడ్యూల్ను అహ్మద్ రూపొందించారని వెల్లడించారు.
ఫరీదాబాద్ మాడ్యూల్ బయటపడిన తర్వాత తీవ్ర భయాందోళనకు గురై ఢిల్లీ పేలుడుకు మహమ్మద్ ఉమర్ పాల్పడ్డాడని వర్గాలు తెలిపాయి. ఉమర్కు మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో నివసిస్తున్న డాక్టర్ షాహీన్ సయీద్ ఈ మాడ్యూల్కు ఫైనాన్షియర్ అని వెలుగులోకి వచ్చింది. ఆమె అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా తెల్చారు. ఈమె జైష్-ఎ-మొహమ్మద్ మహిళా విభాగంలో పనిచేసింది.
Follow Us