ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో భారీగా పట్టుబడిన స్మగ్లింగ్ గోల్డ్

ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్‌లో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మిలాన్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఇద్దరు వ్యక్తుల నుంచి 10 కేజీల గోల్ట్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

author-image
By K Mohan
New Update
gold smagling

gold smagling Photograph: (gold smagling)

ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో భారీగా స్మగ్లింగ్ గోల్డ్ పట్టబడింది. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం అక్రమంగా రవాణా చేస్తున్న 10కిలోల బంగారం దొరికింది. జమ్ము కశ్మీర్‌కు చెందిన 43, 45 ఏళ్ల వయసు గల ఇద్దరు వ్యక్తులు మిలాన్‌ నుంచి ఢిల్లీకి వచ్చారు. వారి దగ్గర నుంచి రూ.కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లో వారి లగేజీని స్కాన్‌ చేయగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అయితే ఆ ఇద్దరు ప్రయాణికుల్ని వ్యక్తిగతంగా తనిఖీ చేయగా సుమారు 10 కిలోల బంగారం పట్టుబడింది.

Also Read :  సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

స్పెషల్‌లో ఓ బెల్ట్ చేసి.. అందులో కోట్ల విలువ చేసే బంగారాన్ని కాయిన్స్‌గా మలిచి పెట్టారు. రెండు బెల్ట్‌లో బంగారు నాణేలను ప్లాస్టిక్‌ ఎన్వలప్‌లో చుట్టి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు చెకింగ్ అధికారులు గుర్తించారు. పట్టుబడిన పసిడి విలువ దాదాపు రూ.7.8 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు.. ఆ ఇద్దరు ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు