Crime: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం!

గుజరాత్‎లోని సురేంద్రనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పికప్ వ్యాన్ ట్రక్కును ఢీకొనడంతో నలుగురు మహిళలు దుర్మరణం చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

New Update
Raod Accident: కర్నూలులో రోడ్డు యాక్సిడెంట్.. ఇద్దరు మృతి, మరో ఐదుగురికి గాయాలు

Crime

Crime: గుజరాత్‎లోని సురేంద్రనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పికప్ వ్యాన్ ట్రక్కును ఢీకొనడంతో నలుగురు మహిళలు దుర్మరణం చెందారు.  మరో 16 మంది తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. 

స్పాట్‎లోనే మృతి:

ఈ ఘటనలో ఇద్దరు మహిళలు స్పాట్‎లోనే చనిపోయ్యారు. మరో ఇద్దరు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. మృతులను మంజుబెన్ రెథారియా (65), మగ్జిబెన్ రెథారియా (72), గలాల్‌బెన్ రెథారియా (60), గౌరీబెన్ రెథారియా (68)గా గుర్తించారు. 

ప్రమాదంపై పోలీస్ స్టేషన్ ఇంఛార్జి ఐబి వాల్వి మాట్లాడుతూ.. చోటిలా ప్రాంతంలో  సోమవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిన్నారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 20 మంది ప్రయాణిస్తున్నారు. వారంతా ఏదో మతపరమైన కార్యక్రమం కోసం సోమనాథ్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సురేంద్రనగర్‌లోని లింబ్డి తాలూకాలోని షియాని గ్రామం నుంచి సోమనాథ్‌కు బయల్దేరిన వ్యాన్.. చోటిలా ప్రాంతానికి రాగానే ఎదురుగా వస్తోన్న లారీని ఢీకొట్టిందని ఐబి వాల్వి తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజ్‌కోట్ సివిల్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read:  భూమిలో పెరిగే ఈ దుంప తింటే.. హెల్దీ ఆరోగ్యం మీ సొంతం

Advertisment
తాజా కథనాలు