Tamilnadu : తమిళనాడులో ఘోర ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న ప్లై ఓవర్

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ప్లైఓవర్ కుప్పకూలింది. తిరుపత్తూర్ జిల్లా అంబూర్ బస్టాండ్ సమీపంలో చెన్నై - బెంగళూరు నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.

author-image
By Bhavana
New Update
Flyover Collapse

Tamilanadu : తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ప్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. తిరుపత్తూర్ జిల్లా అంబూర్ బస్టాండ్ సమీపంలో చెన్నై – బెంగళూరు నేషనల్ హైవేపై నిర్మిస్తున్న ప్లైఓవర్ వద్ద ఈ దారుణం జరిగింది. ప్లైవర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడ పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. 

వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించి శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు 12 మంది కార్మికులను సురక్షితంగా కాపాడారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు సాగిస్తున్నారు.జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అంబూరు నగర పరిధిలో హైలెవల్ ఓ ప్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది.

 ఈ హైలెవల్ ప్లైఓవర్ కనుక నిర్మాణం పూర్తయితే అంబూరు ప్రాంతంలో నేషనల్‌ హైవే పై ట్రాఫిక్ రద్దీ చాలా వరకు తగ్గుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్లైఓవర్ నిర్మాణం పనులు 60 శాతం పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది.

Also Read :  గుడ్‌ న్యూస్‌..ఇక నుంచి ఆ బస్సుల్లో టికెట్ల పై భారీ డిస్కౌంట్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు