/rtv/media/media_files/2025/06/19/fasttag-new-plan-2025-06-19-17-00-03.jpg)
రెగ్యూలర్ గా మీరు హైవే మీద ప్రయాణం చేస్తే మాత్రం ఇది మీకు అదిరిపోయే వార్తే.. అవును టోల్ కలెక్షన్ విధానంలో కేంద్రం సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అదే ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ఏడాదికి ఒకసారి రిచార్జ్ చేసుకుంటే యాక్టివేషన్ తేదీ నుంచి ఏడాది వరకు లేదా 200 ట్రిప్పులు వరకు తిరిగే వెసులుబాటు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. అంటే రూ. 3వేలు పెట్టి ప్లాన్ రిచార్జ్ చేసుకుంటే ఏడాది పాటు దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చన్నమాట. ఈ విధానాన్ని ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి అమలు చేస్తున్నట్లుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. కార్లు,జీప్ లు, వ్యాన్ల వంటి ప్రైవేటు వాహనాలకు మాత్రమే ఈ కొత్త ప్లాన్ వర్తిస్తుంది. ఈ కొత్త ప్లాన్ లో ఉన్న సందేహాలు కొన్నింటిని చూద్దాం.
ఎప్పటినుంచి ఇది అమల్లోకి
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి దీనిని అమలు చేయనుంది కేంద్రం.
ఎలా లెక్కేస్తారు.
టోల్ ప్లాజా దాటిన ప్రతిసారి ఒకటిగా లెక్కిస్తారు. అలా 200 సార్లు దాటినా లేకా ఏడాది సమయం ముగిస్తే ఆ ప్లాన్ అయిపోతుంది. మళ్లీ కావాలని అనుకుంటే రిఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఉన్నది పనిచేస్తుందా
ఇప్పటికే మీ వద్ద ఫాస్టాగ్ ఉంటే మళ్లీ కొనసాల్సిన పనిలేదు. ఒకవేళ మీ వద్ద వార్షిక ఫాస్టాగ్ పాస్ కొంటే ప్రస్తుతం యాక్టివేషన్ లో ఉన్న కార్డుకే ఇది వర్తిస్తుంది.
ఎక్కడెక్కడ పనిచేస్తుంది
దేశంలోని అన్ని నేషనల్ హైవేలపై ఈ కొత్త పాస్ చేస్తుంది. అయితే రాష్ట్ర SHలు, రాష్ట్ర ప్రభుత్వాలు,స్థానిక యంత్రాంగాల నిర్వహణలో ఉన్న టోల్ ప్లాజాల వద్ద మాత్రం అదనంగా వాహనదారులు యూజర్ ఫీజు కట్టాల్సి రావచ్చు.
ఎక్కడ దొరుకుతుంది
రాజ్ మార్గ్ యాత్రా యాప్ లో దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. NHAI అధికార వెబ్ సైట్ లో కూడా ఈ లింక్ పెట్టనున్నారు.
ఎల్లో ప్లేట్ ఉన్న వాహనాలకు వర్తిస్తుందా?
కేవలం వైట్ నంబర్ ప్లేట్ ఉండే కార్స్, వ్యాన్స్ కే వర్తిస్తుంది. క్యాబ్స్, లారీలు, ట్రాక్టర్లు బస్సులకి ఇది వర్తించదు.
ఎవరకి లాభం
తరచూ నేషనల్ హైవేపై ప్రయాణించే వారి కోసం ఈ పాస్ ఎంతో ఉపయోగం అనే చెప్పాలి.
ప్రతి ఏడాది ధర మారుతుందా?
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఈ పాస్ ధరలో మార్పులు ఉండే అవకాశముంది.